Fri Dec 05 2025 19:56:08 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జనసేన జనవాణి కార్యక్రమం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరిస్తారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్యం 3 గంటల వరకూ పవన్ కల్యాణ్ ఆడిటోరియంలోనే ఉంటారు. అక్కడికి వచ్చి ప్రజలు నేరుగా తమ సమస్యలను జనసేనానికి ఇచ్చే వీలుంది. ఇందుకోసం నిన్ననే పవన్ కల్యాణ్ విజయవాడ చేరుకున్నారు.
ప్రతి ఆదివారం...
ప్రతి ఆదివారం జనవాణి కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్నారు. మొదటి రెండు ఆదివారాలు విజయవాడలో, తర్వాత రెండు వారాలు రాయలసీమ, ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రజల నుంచి సమస్యలను తీసుకుని నేరుగా ప్రభుత్వానికి తెలియచేయడమే జనవాణి కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం. అయితే పవన్ వస్తున్నారని తెలిసి ఆయన అభిమానులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

