Fri Dec 05 2025 15:06:17 GMT+0000 (Coordinated Universal Time)
YS Jagan Passport: పాస్పోర్ట్ కేసులో ఎల్లుండి తీర్పు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాస్పోర్ట్ కేసులో

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాస్పోర్ట్ కేసులో తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఎల్లుండి తీర్పును వెలువరించనుంది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో జగన్ అధికారం కోల్పోవడంతో ఆయన డిప్లమాటిక్ పాస్పోర్ట్ రద్దయింది. దీంతో ఆయన జనరల్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కోర్టు నుంచి ఎన్వోసీ కావాలని పాస్పోర్ట్ కార్యాలయం అడగడంతో జగన్ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏడాదికి పాస్పోర్ట్ ఇవ్వాలని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తనకు అయిదేళ్లకు పాస్పోర్ట్ కావాలంటూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది.
ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన తర్వాత, జగన్ దౌత్యపరమైన పాస్పోర్ట్ను కలిగి ఉండే అధికారాన్ని కోల్పోయారు. సాధారణ పాస్పోర్ట్ కోసం ఫైల్ చేయాల్సి వచ్చింది. 5 సంవత్సరాల చెల్లుబాటుతో రెగ్యులర్ పాస్పోర్ట్ కోసం జగన్ విజయవాడ ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రత్యేక కోర్టులో దాఖలు చేశారు. విదేశాలకు వెళ్లేందుకు వీలుగా సాధారణ పాస్పోర్టు మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు. కేవలం ఒక సంవత్సరం చెల్లుబాటుతో కూడిన పాస్పోర్ట్ను అతనికి జారీ చేయవచ్చని తీర్పు చెప్పింది.
Next Story

