Thu Dec 18 2025 05:17:27 GMT+0000 (Coordinated Universal Time)
కోలగట్లకు పదవి కన్ఫర్మ్
వైసీపీ సీనియర్ నేత కోలగట్ల వీరభద్రస్వామికి పదవిని జగన కన్ఫర్మ్ చేశారు. డిప్యూటీ స్పీకర్ గా ఆయనను ఎంపిక చేయనున్నారు

వైసీపీ సీనియర్ నేత కోలగట్ల వీరభద్రస్వామికి పదవిని జగన కన్ఫర్మ్ చేశారు. డిప్యూటీ స్పీకర్ గా ఆయనను ఎంపిక చేయనున్నారు. ఈ నెల 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అదే రోజున డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఈ సమావేశాల్లోనే కోలగట్ల వీరభద్రస్వామిని డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
సీనియర్ నేతగా...
కోలగట్ల వీరభద్ర స్వామి సీనియర్ నేత. పార్టీని తొలినుంచి అంటిపెట్టుకున్న లీడర్. ఆయనకు తొలిమంత్రివర్గంలోనే చోటు దక్కుతుందని అందరూ భావించారు. కానీ వైశ్య సామాజికవర్గం కోటాలో వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఆ పదవి కేటాయించారు. రెండో విడత అయినా దక్కుతుందని భావించినా కొన్ని రాజకీయ కారణాల వల్ల అది వీలు కాలేదు.
డిప్యూటీ స్పీకర్ గా...
దీంతో కోలగట్ల వీరభద్రస్వామిని డిప్యూటీ స్పీకర్ గా ఎంపిక చేయాలని జగన్ నిర్ణయించారు. ఇప్పటి వరకూ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కోన రఘుపతి స్థానంలో కోలగట్లకు అవకాశం కల్పించనున్నారు. విజయనగరం జిల్లాలో పార్టీ బలోపేతానికి తొలి నుంచి కోలగట్ల కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మంత్రి పదవి ఇవ్వలేకపోయినా కేబినెట్ హోదాగల డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారు.
Next Story

