Thu Mar 19 2026 05:27:18 GMT+0530 (India Standard Time)
నేడు ఏపీ ఉద్యోగుల జేఏసీ ప్రాంతీయ సదస్సు
నేడు ఏపీ అమరావతి ఉద్యోగుల జేఏసీ ప్రాంతీయ సదస్సు అనంతపురంలో జరగనుందని జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

నేడు ఏపీ అమరావతి ఉద్యోగుల జేఏసీ ప్రాంతీయ సదస్సు అనంతపురంలో జరగనుందని జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగుల గుండె చప్పుడు ప్రభుత్వానికి వినిపించేందుకే ఈ ప్రాంతీయ సదస్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని ప్రాంతాల ఉద్యోగుల మద్దతు కూడగట్టి, చైతన్య పరచడమే ప్రాంతీయ సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. అనంతపురం లో జరిగే ప్రాంతీయ సధస్సు రెండవదని తెలిపారు. 68 రోజుల నుంచి...ఈ సదస్సులో ఉద్యోగులంతా అధికసంఖ్యలో పాల్గోని ఐక్యను చాటాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు నిచ్చారు.
డిమాండ్లు పరిష్కరించేంత వరకూ...
ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఎంతటి పోరాటాని కైనా సిద్దంగానే ఉంటామని బొప్పరాజు తెలిపారు. ఏపిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డు,కాంట్రాక్టు & అవుట్ సోర్శింగ్ ఉద్యోగులు ఏఒక్కరూ కూడా ప్రస్తుతం సంతోషంగా లేక పోవడానికీ కారణం ప్రభుత్వమేనని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినే హామిలనే అమలు చేయమని గత 68 రోజులు గా శాంతి యూతంగా చేస్తున్న పోరాటలకు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
Next Story

