Sat Jan 31 2026 05:52:38 GMT+0000 (Coordinated Universal Time)
మహా రష్... దర్శనానికి ఎన్నిగంటలంటే?
స్వామి వారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు క్యూలోకి వచ్చే వారికి మరో రెండు మూడు గంటలు అదనంగా పడుతుంది

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వీరికి స్వామి వారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుంది. ఇప్పుడు క్యూలోకి వచ్చే వారికి మరో రెండు మూడు గంటలు అదనంగా పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ప్రత్యేక దర్శనానికి...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు గంటల నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 67,439 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,450 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.60 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
Next Story

