Tue Jan 20 2026 17:01:04 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శ్రీవారి ఆదాయం రికార్డు బ్రేక్... వరసగా 22 నెలలో కూడా
డిసెంబరు నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 116 కోట్ల రూపాయలకు చేరింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది

డిసెంబరు నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 116 కోట్ల రూపాయలకు చేరింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. దీంతో వరసగా 22వ నెలలో వంద కోట్ల మార్క్ ఆదాయం దాటింది. వంద కోట్ల రూపాయల ఆదాయం సుమారు ఏడాది నుంచి దాటుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
వంద కోట్లు మార్క్ దాటి...
డిసెంబరు నెలలో వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేయడంతో పాటు ఏడాది చివరి నెల కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నందునే ఈ ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. జనవరి నెలలోనూ ఆదాయం మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
Next Story

