Mon Dec 15 2025 08:59:33 GMT+0000 (Coordinated Universal Time)
రుషికొండ తవ్వకాలపై హైకోర్టులో?
విశాఖలోని రుషికొండ తవ్వకాలపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.

విశాఖలోని రుషికొండ తవ్వకాలపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిటీలో ఐదుగురు కేంద్ర ఉద్యోగులను రుషికొండ తవ్వకం పరిశీలనకు కమిటీగా వేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు కమిటీలో రాష్ట్ర ఉద్యోగులను ఎందుకు నియమించారని ప్రశ్నించింది.
కమిటీలో వారు?
కేంద్ర ఉద్యోగులను నియమించమంటే రాష్ట్ర ఉద్యోగులను నియమించడంలో ఆంతర్యమేమిటని నిలదీసింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. రుషికొండలో తవ్వకాలు జరుపుతూ పర్యావరణానికి హాని కల్గిస్తున్నారని దాఖలయిన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతుంది.
Next Story

