Fri Dec 05 2025 21:51:52 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu: ముందస్తు బెయిల్ విచారణ రేపటికి వాయిదా
మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది

మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. దీనిపై విచారణను రేపటికి వాయిదా వేసింది. మద్యం విషయంలో చంద్రబాబు అధికారంలో ఉండగా అవినీతి జరిగిందని సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారించిన హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
ఈ నెల 23న విచారణ...
అవుటర్ రింగ్ రోడ్డు కేసులోనూ చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ నేడు జరిగింది. అయితే ఈ కేసులలో సీఐడీ సమయం కోరడంతో ఈ నెల 23కు విచారణను వాయిదా వేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణను ఈ నెల 23కు వాయిదా వేసిన హైకోర్టు
Next Story

