Wed Feb 04 2026 15:01:42 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్-5 జోన్పై నేడు సుప్రీంకోర్టులో
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఆర్-5 జోన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఆర్-5 జోన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఆదేశాలపై సుప్రీంకోర్టును రాజధాని రైతులు ఆశ్రయించారు. అమరావతి రైతులు వేసిన రెండు వేర్వేరు పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది.
నేడు విచారణ...
విచారణ జరపనున్న జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ రాజేష్ బిందాల్ ఈ కేసును విచారించనున్నారు. ఆర్ 5 జోన్లో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వవద్దని, తాము ప్రభుత్వానికి ఇచ్చిన భూములను పేదలకు పంచి పెడుతున్నారంటూ రైతులు కోర్టును ఆశ్రయించడంతో నేడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Next Story
