Fri Dec 05 2025 13:11:57 GMT+0000 (Coordinated Universal Time)
నాట్ బి ఫోర్ మి అన్న సీజే
సీబీఐ విచారణకు అప్పగించాలని కోరుతూ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది

స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని కోరుతూ మాజీ పార్లమెంటు ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన తెలిపారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థ కంటే కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని ఆయన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
మరో బెంచ్కు...
అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటీషన్ పై విచారించిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం నాట్ బిఫోర్ మి అంటూ వేరోక బెంచ్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో బెంచ్ కు బదిలీ చేయాలంటూ రిజిస్ట్రీని ఆదేశించింది. దీంతో ఉండవల్లి అరుణ్ కుమార్ పిటీషన్ మరో బెంచ్ విచారించే అవకాశాలున్నాయి.
Next Story

