Wed Dec 24 2025 10:29:20 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సుప్రీంకోర్టులో విచారణ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటీషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటీషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి లేకుండా తనపై నమోదయిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు.
క్వాష్ పిటీషన్పై...
దీనిపై ఈరోజు విచారణకు రానుంది. సుప్రీంకోర్టులో 63వ ఐటమ్ గా లిస్ట్ అయింది. జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మానసం ఈ పిటీషన్ ను విచారించనుంది. ఈ క్వాష్ పిటీషన్ పై సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఈ కేసులో అరెస్టయి గత 25 రోజుల నుంచి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Next Story

