Fri Feb 14 2025 17:45:03 GMT+0000 (Coordinated Universal Time)
ఉగాదికి గుడ్ న్యూస్.. చెప్పేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రజలుకు ఉగాది నాటి నుంచి గుడ్ న్యూస్ ను ప్రభుత్వం అందించనుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రజలుకు ఉగాది నాటి నుంచి గుడ్ న్యూస్ ను ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పీ4 విధానాన్ని ఉగాది పండుగ నుంచి ప్రారంభిచనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పీ4 విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10 శాతం మంది...అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని సీఎం అన్నారు. దీనిపై సమగ్ర విధి విధానాలను రూపొందించేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తీసుకునేందుకు ప్రత్యేకంగా పోర్టల్ను తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు.
గుర్తించాలని అధికారులకు ఆదేశం...
పేదరిక నిర్మూలన విషయంలో ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలను తీసుకుని పీ4 విధానాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలతో పాటు కొంత ఉన్నత స్ధాయిలో ఉన్నవారు పేదలకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారని....వీరందరినీ ఒక గొడుగు కిందకు తెచ్చి పీ4 విధానం అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇదే సమయంలో ప్రత్యేక సర్వే ద్వారా అట్టగుడున ఉన్న వర్గాలను గుర్తించి ..వారికి సాయం అందేలా చేస్తామన్నారు. దీనికోసం అవసరమైన డేటాను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
Next Story