Wed Jan 28 2026 23:51:51 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : జూన్ నెల పింఛన్లకు నగదు సిద్ధం
ఆంధ్రప్రదేశ్ లో జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లను విడుదల చేసేందుకు ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లను విడుదల చేసేందుకు ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. జూన్ 1వ తేదీన పింఛన్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున గతంలో అనుసరించిన విధానాన్నే జూన్ నెలలో కూడా పింఛను విధానంలో అనుసరించాలని నిర్ణయించింది.
గత నెల మాదిరిగానే...
జూన్ నెలకు సంబంధించి ఇప్పటికే ప్రబుత్వం 1,939 కోట్ల రూపాయలను విడుదల చేసింది. జూన్ ఒకటో తేదీన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 47,74,533 మందికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. బ్యాంకు అకౌంట్లు లేని వారికి జూన్ 1వ తేదీ నుంచి ఐదో తేదీ మధ్యలో 17,56,105 మందికి పింఛన్లు అందచేయనున్నారు.
Next Story

