Fri May 03 2024 00:56:30 GMT+0000 (Coordinated Universal Time)
ట్యాపింగ్ పై సర్కార్ సీరియస్
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విచారణకు సిద్ధమయింది
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపై విచారణకు సిద్ధమయింది. ఫోన్ ట్యాపింగ్ కాదని, అది రికార్డింగ్ మాత్రమేనని మంత్రులందరూ చెబుతున్నారు. కోటంరెడ్డి మాత్రం తన ఫోన్ ట్యాపింగ్ అయిందని, అందుకు తగిన ఆధారాలంటూ మీడియా సమావేశంలో చూపెట్టారు.
ఇంటలిజెన్స్ అధికారులు...
దీంతో ఇంటలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. మీడియా సమావేశంలో కోటంరెడ్డి విడుదల చేసిన ఆడియోపై వివరాలను ఇంటలిజెన్స్ అధికారులు సేకరిస్తున్నారు. కోటంరెడ్డితో ఆయన స్నేహితుడు రామశివారెడ్డి మాట్లాడిన మాటలు బయటకు ఎలా వచ్చాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. రామశివారెడ్డిని కూడా విచారించే అవకాశముందని తెలిసింది. రామశివారెడ్డి ఫోన్ డేటాను కూడా ఇంటలిజెన్స్ అధికారులు విశ్లేషిస్తున్నారు.
Next Story