Sat May 18 2024 17:32:28 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబును నిలదీయండి : సజ్జల
ప్రతి చోటా చంద్రబాబును నిలదీయాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు నిచ్చారు
ప్రతి చోటా చంద్రబాబును నిలదీయాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు నిచ్చారు. మోసానికి, వెన్నుపోటుకు చంద్రబాబు ట్రేడ్ మార్క్ అని ఆయన అన్నారు. పది మంది ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి చోట ప్రజలు చంద్రబాబును నిలదీయాలని పిలుపునిచ్చారు. అధికారం ఇచ్చిన రోజు ఏం చేశారని చంద్రబాబును ప్రశ్నించాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. అంతర్జాతీయ స్కాం రియల్ ఎస్టేట్ స్కామ్ అమరావతి అని ఆయన అన్నారు.
ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం...
నూతనంగా ఎన్నికైన శాసనమండలి సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్సీలు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు కొందరు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మర్రి రాజశేఖర్, చంద్రగిరి ఏసురత్నం, పోతుల సునీత, బొమ్మి ఇజ్రాయిల్, జయమంగళ వెంకట మణ, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, పెనుమత్స సూర్యనారాయణ రాజు, మంగమ్మలు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Next Story