Tue Jan 20 2026 01:31:23 GMT+0000 (Coordinated Universal Time)
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
విశాఖ-కిరండూల్ రైల్వే లైన్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. శివలింగపురం వద్ద పట్టాలు తప్పింది.

విశాఖ-కిరండూల్ రైల్వే లైన్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. శివలింగపురం వద్ద పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో కొన్ని రైళ్లు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం పదిహేను బోగీలు పట్టాల పక్కకు నుంచి ఒరిగిపోవడంతో ఆ ట్రాక్ పై రైళ్ల రాకపోకలను నిలిపేశారు.
కిరండూల్ మార్గంలో...
కిరండూల్ మార్గంలో ప్యాసింజర్ ను అధికారలుు రద్దు చేశారు. నెలరోజుల వ్యవధిలో పట్టాలు తప్పడం ఇది రెండో ఘటన కావడం విశేషం. యుద్ధ ప్రాతిపదికమీద ట్రాక్ ను క్లియర్ చేసే పనిలో అధికారులు ఉన్నారు. ప్రమాదం ఎందుకు జరిగిందన్న దానిపై విచారణ జరుపుతున్నారు.
Next Story

