Thu Jan 29 2026 08:51:23 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దివ్యాంగులకు ఉచితంగా త్రీవీలర్ మోటారు సైకిళ్లు నిర్వహించాలని నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దివ్యాంగులకు ఉచితంగా త్రీవీలర్ మోటారు సైకిళ్లు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 25 వరకు దరఖాస్తులను ఆహ్వానం అందింది. రాష్ట్రంలోని అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్ త్రీ వీలర్ మోటారు సైకిళ్లను అందజేస్తామని అందజేస్తామని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. ఈ నెల 25వ తేదీ లోపు www.apdas-cac.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఉచితంగా త్రీవీలర్...
డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, రెగ్యులర్ డిగ్రీ, ఆపై ఉన్నతవిద్య చదువుతున్న విద్యా ర్థులు, పదో తరగతి ఉత్తీర్ణులై స్వయం ఉపాధితో జీవించేవారు, 18 నుంచి 45 ఏళ్ల లోపు ఉండి 70 శాతం అంగవైకల్యం ఉన్న వారు దరఖాస్తు చేసు కొనేందుకు అర్హులని అని మంత్రి స్వామి వెల్లడించారు. అర్హత కలిగిన వారంతా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి సూచించారు.
Next Story

