Fri Jan 30 2026 06:36:08 GMT+0000 (Coordinated Universal Time)
రెండోరోజు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ నేటితో ముగియనుంది. రెండో రోజు పదకొండు మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు

విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ నేటితో ముగియనుంది. రెండో రోజు కూడా పదకొండు మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు. మొత్తం ఎనిమిది అంశాలపై రెండో రోజు సెమినార్లు ఉంటాయి. మధ్యాహ్నం 12.45 గంటలకు ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం ఉంటుంది.
లక్షన్నర కోట్ల ఎంవోయూ...
ఈ రోజు కూడా కిషన్ రెడ్డి, సోనోవాలాతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులు సమ్మిట్ కు హాజరు కానున్నారు. ఈరోజు లక్షన్నర కోట్ల రూపాయల మేరకు అవగాహన ఒప్పందాలు జరుగుతాయని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరానాధ్ తెలిపారు. నిన్న ప్రభుత్వ 11.50 లక్షల కోట్ల రూపాయల ఎంవోయూలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎంవోయూలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం బయలుదేరి ముఖ్యమంత్రి తాడేపల్లికి చేరుకోనున్నారు.
Next Story

