Tue Jan 20 2026 08:15:54 GMT+0000 (Coordinated Universal Time)
వల్లభనేని వంశీకి థ్రెట్... అందుకే ప్రభుత్వం?
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భద్రతను పెంచారు. ఆయనకు నిన్నటి వరకూ 1+1 గా భద్రత ఉండేది.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భద్రతను పెంచారు. ఆయనకు నిన్నటి వరకూ 1+1 గా భద్రత ఉండేది. అయితే ఇప్పుడు 4+4 కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వల్లభనేని వంశీకి సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారు. దీంతో ఆయనకు భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
చంద్రబాబు కుటుంబ సభ్యులను...
వల్లభనేని వంశీ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గన్నవరం నుంచి గెలిచారు. తర్వాత వైసీపీకి చేరువయ్యారు. దీంతో పాటు ఇటీవల చంద్రబాబు కుటుంబ సభ్యుల పైన చేసిన వ్యాఖ్యలతో వల్లభనేని వంశీకి థ్రెట్ ఉందని పోలీసులు భావిస్తున్ననారు. అందుకే ఆయనకు భద్రతను పెంచినట్లు తెలిసింది.
Next Story

