Wed Jan 28 2026 20:47:08 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : రాజుకు సహాయ మంత్రి హోదా
మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్తగా నియమితులయ్యారు

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్తగా నియమితులయ్యారు. రాజుకు సహయ మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017-2023 మధ్య కాలంలో ఎమ్మెల్సీగా పని చేశారు. 22 ఏళ్లుగా రాజు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. పార్టీలో వివిధ పదవులు నిర్వహించారు.
సీనియర్ నేతగా...
2007-2013 మధ్య కాలంలో తెలుగుయువత కార్యదర్శిగా కూడా పనిచేశారు. తర్వాత 2013లో రాష్ట్ర కార్యనిర్వహాక కార్యదర్శిగా వ్యవహరించి పార్టీ అధినేత చంద్రబాబు అప్పజెప్పిన పనులను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సమయంలో చంద్రబాబు నిర్వహించి వస్తున్నా మీ కోసం పాదయాత్రలో రాజు వాలంటీర్ల సమన్వయకర్తగా పని చేసి పాదయాత్ర సజావుగా సాగేలా తన వంతు పాత్ర పోషించారు. దీంతో ఆయనకు సహాయ మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story

