Tue Jan 20 2026 16:27:24 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా గౌతమ్ సవాంగ్
మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించింది

మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించింది. రెండు రోజుల క్రితం డీజీపీ గా ఉన్న గౌతమ్ సవాంగ్ ను ప్రభుత్వం తప్పించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో రాజేంద్ర నాధ్ రెడ్డికి డీజీపీ బాధ్యతలను అప్పగించారు. జీఏడీ లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం అప్పుటి ఉత్తర్వుల్లో పేర్కొంది.
నేడో, రేపో....
తాజాగా గౌతమ్ సవాంగ్ ను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా గౌతమ్ సవాంగ్ నేడో, రేపో బాధ్యతలను స్వీకరించనున్నారు.
Next Story

