Sun Feb 01 2026 14:20:15 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి కోరిన వైఎస్ జగన్
బ్రిటన్ వెళ్లేందుకు తనకు అనుమతివ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

బ్రిటన్ వెళ్లేందుకు తనకు అనుమతివ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. యూకేలో చదువుతున్న తన కుమార్తె వద్దకు సెప్టంబరు మొదటి వారంలో వెళ్లేందుకు అనుమతించాలని ఆయన సీబీఐ కోర్టులో పిటీషన్ వేశారు. అయితే ఈ విచారణను నేటికి వాయిదా వేశారు.
ఏటా వైఎస్ జగన్....
ప్రతి ఏటా వైఎస్ జగన్ యూకే వెళ్లి తన కుమార్తెతో పాటు కుటుంబ సభ్యులందరూ గడిపి వస్తారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ పిటీషన్ దాఖలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ విదేశాలకు వెళితే సీీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే జగన్ ఈ పిటీషన్ దాఖలుచేశారు.
Next Story

