Fri Dec 05 2025 11:30:30 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కర్నూలుకు వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కర్నూలకు రానున్నారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కర్నూలకు రానున్నారు. ఒక ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్ వస్తున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాపర్ట్ లో కర్నూలుకు చేరుకోనున్న జగన్ వైసీపీ నేత కుటుంబంలో జరిగే వివాహ వేడుకలో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆ కార్యక్రమంలో పాల్గొని జిల్లా నేతలతో మాట్లాడతారు.

నేతలతో మాట్లాడి...
అనంతరం కర్నూలు నుంచి బయలుదేరి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి జగన్ చేరుకుంటారు. కర్నూలు జిల్లాకు జగన్ వస్తుండటంతో పెద్దయెత్తున కార్యకర్తలు వచ్చే అవకాశముందని భావించిన నేతలు పోలీసుల బందోబస్తును కోరారు. దీంతో కర్నూలు జిల్లాలో వైసీపీ అధినేత జగన్ దాదాపు గంట సేపు ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

