Mon Feb 02 2026 09:19:56 GMT+0000 (Coordinated Universal Time)
బైక్ ర్యాలీలో నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో జరగనున్నాయి

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో జరగనున్నాయి. తెలంగాణలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారు. అలాగే అమరావతి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న వేడుకల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొననున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా.....
నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసం నుంచి బైక్ ర్యాలీతతో మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని చంద్రబాబు పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Next Story

