Thu Mar 12 2026 14:25:46 GMT+0530 (India Standard Time)
వెంకన్న స్వామికి పయ్యావుల పూజలు
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ టీటీడీ దేవాలయానికి వచ్చారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ టీటీడీ దేవాలయానికి వచ్చారు. అక్కడ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాసనసభలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో వెంకన్న స్వామి ఆశీస్సులు పొందారు.
బడ్జెట్ ప్రతులను...
బడ్జెట్ ప్రతులను వెంకటేశ్వరస్వామి ముందు ఉంచిన పయ్యావుల కేశవ్ ప్రత్యేక పూజలను నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. మరి కొద్ది సేపట్లో కేబినెట్ సమావేశమై రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. తర్వాత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Next Story

