Thu Jan 29 2026 06:28:57 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖను రాజధానిని చేయడమేంట్రా బాబు?
విశాఖ గర్జనపై సినీనటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు ట్వీట్ చేశారు

విశాఖ గర్జనపై సినీనటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు ట్వీట్ చేశారు. "విశాఖను మీరు రాజధానిని చేయడమేంట్రా బాబు? విశాఖ ఆల్రెడీ అమ్మ మొగుడు లాంటి సిటీ. వీలయితే విశాఖను ఇండియాకు రాజధానిని చేయ్యమని గర్జించండి" అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.
గర్జన జరగడంతో...
విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని, మూడు రాజధానుల ముద్దంటూ ఈరోజు జేఏసీ నేతృత్వంలో విశాఖ గర్జన జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో వైసీీపీ మంత్రులు పాల్గొన్నారు. దీనిపై నాగబాబు స్పందించారు. కొద్దిసేపటి క్రితమే పవన్ కల్యాణ్ కూడా విశాఖ పర్యటనకు వచ్చారు.
Next Story

