Sat Jan 31 2026 08:29:22 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైకోర్టుకు రాజధాని రైతులు
రాజధాని అమరావతి రైతులు నేడు హైకోర్టును ఆశ్రయించనున్నారు

రాజధాని అమరావతి రైతులు నేడు హైకోర్టును ఆశ్రయించనున్నారు. తమకు తిరుపతిలో బహిరంగ సభ జరుపుకునేందుకు అనుమతివ్వాలని కోరనున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు గత నలభై రోజులకు పైగానే మహా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ఈ నెల 16వ తేదీ తిరుమల శ్రీవారి దర్శనంతో ముగియనుంది. తిరుపతిలో 17వ తేదీన బహిరంగ సభను నిర్వహించాలని రాజధాని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది.
అన్ని పార్టీల నేతలను...
ఈ మేరకు రైతు సంఘం నేతలు రాకేష్ టికాయత్ తో సహా పలువురు పార్టీల నేతలను ఆహ్వానించారు. చంద్రబాబు కూడా ఈ సభకు హాజరు కావాలనుకుంటున్నారు. కానీ పోలీసులు సభకు అనుమతి ఇవ్వలేదు. దీంతో రైతులు ఈరోజు హైకోర్టును ఆశ్రయించి తమ సభకు అనుమతిప్పించాలని కోరనున్నారు.
Next Story

