Thu May 02 2024 14:13:33 GMT+0000 (Coordinated Universal Time)
రాజధాని రైతులకు జేడీ మద్దతు
అమరావతిలోనే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు.
అమరావతిలోనే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరిట జరుగుతున్న ఈ పాదయాత్రకు అన్ని పార్టీలూ మద్దతు పలికాయి. పలు ప్రజాసంఘాలు సయితం సంఘీభావాన్ని ప్రకటించాయి. టీడీపీ తొలి నుంచి పాదయాత్రకు మద్దతు తెలుపుతుండగా, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా పాదయాత్రలో పాల్గొంటూ వారికి అండగా నిలుస్తున్నాయి.
కొనసాగించాల్సిందే...
తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ కూడా రాజధాని పాదయాత్రకు మద్దతు తెలిపారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో జరుగుతున్న పాదయాత్రలో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని ఆయన కోరారు. రైతులు ఏడాదిగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని చెప్పారు.
Next Story