Sun Dec 14 2025 04:54:10 GMT+0000 (Coordinated Universal Time)
సాయిరెడ్డిపై బొండా ఉమ ధ్వజం
వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేకున్నా వనరులున్న చోట పోకస్ పెట్టిందని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు

వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేకపోయినా ఎక్కడైతే వనరులుంటే అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టిందని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. మీడియాతో ఆయన కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. గనులను దోచుకున్నారన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి వైసీపీలో రెండో స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి విశాఖలో అడ్డగోలుగా దోచుకున్నారని టీడీపీ మొదట నుంచి చెబుతుందన్నారు. విజయసాయిరెడ్డి బినామీల పేర్లతో పాటు అల్లుడి, కూతురు పేర్లతో కూడా భూములు కొట్టేసే ప్రయత్నం చేశారన్నారు. ఎప్పటి నుంచో దసపల్లా ఆస్తులను నిస్సిగ్గుగా కొట్టేశారన్నారు.
తాము కంటికి రెప్పలా కాపాడితే....
టీడీపీ హయాంలో కంటికి రెప్పలా కాపాడిన భూములను కొల్లగొట్టారన్నారు. 40 వేల కోట్ల రూపాయల భూములను విశాఖలో స్వాహా చేశారన్నారు. విజయసాయిరెడ్డి చెప్పింది అన్ని అబద్ధాలేనని బొండ ఉమ అన్నారు. కూతురికి పెళ్లి చేసి పంపామని, భూములు కొట్టేసిన విషయాన్ని ఒప్పుకుంటూనే బుకాయిస్తున్నాడని బొండా ఉమ అన్నారు. మీ బినామీల పేరుతో మూడున్నరేళ్లలో విశాఖలో ఆయన కొట్టేసిన భూముల్లో దసపల్లా భూములు వారికి ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఐదు వేల కోట్లు విలువ చేసే దసపల్లా భూములను విజయసాయిరెడ్డి తన కూతురికి కట్టబెట్టాడన్నారు.
Next Story

