Fri Dec 05 2025 21:59:14 GMT+0000 (Coordinated Universal Time)
నేడు నిర్ణయం.. సమీక్ష తర్వాత?
ఏపీ లో సంక్రాంతి సెలవుల అనంతరం నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం అవుతున్నాయి. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోలేదు

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సెలవుల అనంతరం నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం అవుతున్నాయి. ప్రభుత్వం విద్యాసంస్థలపై నిర్ణయం తీసుకోలేదు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాత్రం యధాతధంగా పాఠశాలలు నడుస్తాయని చెప్పారు. అయితే కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రోజుకు నాలుగు వేలకేసులకు పైగానే నమోదవుతున్నాయి. నైట్ కర్ఫ్యూ పెట్టాలని కూడా నిర్ణయించారు.
కోవిడ్ పై ....
ఈ నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్ కోవిడ్ పై సమీక్ష చేయనున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదలపై వైద్య ఆరోగ్య శాఖతో చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు, ఆన్ లైన్ క్లాసుల నిర్వహణపై జగన్ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Next Story

