Sun May 19 2024 23:56:34 GMT+0000 (Coordinated Universal Time)
సిక్కోలులో మళ్లీ భూప్రకంపనలు
శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు ఆందోళనలు కల్గిస్తున్నాయి. జిల్లాలోని ఇచ్ఛాపురంలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది.
శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు ఆందోళనలు కల్గిస్తున్నాయి. జిల్లాలోని ఇచ్ఛాపురంలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా భూమి కంపిచండం, ఇళ్లలోని వస్తువులతో పాటు నిద్రిస్తున్న వారు కూడా కదలడంతో భయంతో పరుగులు తీశారు. ఈ వారంలోనే ఒకసారి భూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.
భయపడాల్సిన...
ిఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాలల్లోని రత్తకర్ణ, తేలుకుంచి, అమీన్ సాహిబ్ పేట, పురుషోత్తపురం గ్రామాల్లో భూ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు కూడా చెప్పారు. అయితే భయపడాల్సిన పనిలేదని, వాతావరణంలో మార్పుల ఆధారంగా ఇవి సంభవిస్తాయని అధికారులు చెబుతున్నారు.
Next Story