Wed Jan 28 2026 22:14:08 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : పించన్ల పంపిణీ మొదలు.. ఉదయం నుంచే?
ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ మొదలయింది. ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆరంభమయింది

ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ మొదలయింది. ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆరంభమయింది. మొత్తం ఏపీ వ్యాప్తంగా ఈ పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. లబ్దిదారులకు స్వయంగా పింఛన్లను పంపిణీ చే్యనున్నారు.
కూటమి నేతలంతా...
ిపింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండగలా చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే సచివాయ సిబ్బంది పింఛన్ల పంపిీణీని ఈరోజు మిగిలిపోయినవి రేపటిలోగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో నేడు గ్రామం నుంచి పట్టణం వరకూ పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.
Next Story

