Fri Dec 05 2025 15:42:36 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం జగన్ తో డీజీపీ భేటీ
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో డీజీపీ గౌతం సవాంగ్ భేటీ అయ్యారు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో డీజీపీ గౌతం సవాంగ్ భేటీ అయ్యారు. నిన్న ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం గురించి ఆయన వివరించనున్నట్లు తెలిసింది. పోలీసులు ఆంక్షలు విధించినా లక్షల సంఖ్యలో ఉద్యోగులు విజయవాడకు చేరుకోవడంపై జగన్ సీరియస్ అయ్యారు. పోలీసు వైఫల్యంగానే పార్టీ నేతలు కూడా అభిప్రాయపడ్డారు.
నిన్నటి ఘటనలపై.....
అయితే తాము ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించలేదని చెప్పడానికి వారిని ఫ్రీగా వదిలేశామని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతం సవాంగ్ జగన్ తో భేటీ అయి నిన్నటి చలో విజయవాడ కార్యక్రమంపై పూర్తి స్థాయి నివేదికను ఇవ్వనున్నారని తెలిసింది.
Next Story

