Wed Jan 21 2026 00:40:05 GMT+0000 (Coordinated Universal Time)
నల్లమల చిట్టడివిలో చిక్కుకున్న పదిహేను మంది.. ఆచూకీ కోసం?
ప్రకాశం జిల్లా నల్లమల అడవిలో కొందరు భక్తులు చిక్కుకుపోయారు

ప్రకాశం జిల్లా నల్లమల అడవిలో కొందరు భక్తులు చిక్కుకుపోయారు ఇష్ట కామేశ్వరీదేవి ఆలయానికి వెళ్తూ అడవిలో దారి తెలియక తప్పిపోయారని తెలిసింది.ఆలయానికి వెళుతూ అటవీ ప్రాంతంలో దాదాపు పదిహేను మంది భక్తులు చిక్కుకుపోయారు. తప్పిపోయిన పదిహేను మంది భక్తులు రేపల్లె మండలం మంత్రిపాలెం వాసులుగా గుర్తించారు.

దారి తెలియక...
పోలీసులకు ఫోన్ చేసి భక్తులు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.అయితే వెంటనే పోలీసు బృందాలు అడవిల్లో చిక్కుకున్న భక్తుల కోసం గాలింపు చర్యలుచేపట్టారు. నల్లమల అటవీప్రాంతంలో క్రూర జంతువులు ఎక్కువగా ఉండటం, అవి ఎక్కువగా సంచరిస్తుండటంతో భక్తుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

