Thu Jan 29 2026 07:40:54 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : క్యూ లైన్ బయట వరకూ విస్తరించి.. దర్శనానికి ఎంత సమయం అంటే?
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం కావడంతో భక్తుల అధిక సంఖ్యలో తరలి వచ్చారు. శని, ఆదివారాలలో సహజంగా భక్తులు అధిక సంఖ్యలో తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకుని తన మొక్కలు తీర్చుకుంటారు. అందుకే శని, ఆదివారాల్లో ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. ఈరోజు తిరుమలలో మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.
కంపార్ట్మెంట్లన్నీ...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయి ఉన్నారు. బయట కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూ లైన్ విస్తరించి ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 82,139 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 39,849 మంది తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.97 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

