Sat Mar 07 2026 15:09:02 GMT+0530 (India Standard Time)
అహోబిలంలో భక్తుడిపై చిరుత దాడి
కర్నూల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో జరిగిందీ ఘటన. ఎగువ అహోబిలంలో

అహోబిలం క్షేత్రంలో భక్తుడిపై చిరుత దాడి చేయడం కలకలం రేపింది. కర్నూల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో జరిగిందీ ఘటన. ఎగువ అహోబిలంలో పావన నరసింహస్వామి ఆలయానికి కాలినడకన వెళ్తున్న భక్తుడిపై దూకి చిరుత దాడి చేసింది.
Also Read : చలో సంక్రాంతి.. కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్లు
కాగా.. భక్తుడు చాకచక్యంగా తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. చిరుత దాడితో.. భక్తులు భయాందోళనకు గురయ్యారు. వారంరోజులుగా ఆ ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో.. భక్తులు మెట్లమార్గం గుండా వెళ్లేందుకు భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు తగు చర్యలు తీసుకుని, తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
Next Story

