Montha Cyclone : మరికొద్ది గంటలు పాటు టెన్షన్.. మొంథా ఎలా దెబ్బతీస్తుందో?
మొంథా తుపాను మరింత బలపడి ఆంధ్రప్రదేశ్ వైపునకు దూసుకు వస్తుంది. సముద్రం ఇప్పటికే అల్లకల్లోంగా మారింది

మొంథా తుపాను మరింత బలపడి ఆంధ్రప్రదేశ్ వైపునకు దూసుకు వస్తుంది. సముద్రం ఇప్పటికే అల్లకల్లోంగా మారింది. విశాఖ తీరంలో బలమైన ఈదురుగాలతో పాటు భారీ వర్షం పడుతుంది. నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని మొంథా తుపాను బలపడింది. ఈరోజు సాయంత్రానికి కానీ అర్ధరాత్రి కాని కాకినాడ వద్ద తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకూ రెడ్ అలెర్ట్ ప్రకటించారు. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉదయానికి తీవ్రతుపానుగా బలపడటంతో ఈ ప్రభావం ఎంత మేర ఉంటుందోనని భావించిన అధికార యంత్రాంగం ముందుగానే అప్రమత్తమయింది. ఈరోజు సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం మరియు కాకినాడ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90-110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు.

