Thu Jan 29 2026 11:51:38 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు తిరుమలలో రద్దీ సాధారణమే.. కారణమేంటంటే?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉండి. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉండి. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. భక్తులు పెద్దగా క్యూ లైన్ లలో వేచి ఉండకుండానే స్వామి వారిని దర్శించుకుంటున్నారు. వసతి గృహాలు కూడా అడిగిన వెంటనే దొరుకుతున్నాయి. ఇందులో పెద్దగా ఇబ్బంది పడే అవసరం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 70,815 మంది మంది దర్శించుకున్నారు. వీరిలో 25,245 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కుల చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.25 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లలో కొన్నింటిలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూలైన్ లోకి ఉదయం ఏడు గంటలకకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుంది.
Next Story

