Sat Apr 20 2024 05:10:24 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణమే
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం కావడంతో కొంత భక్తుల రద్దీ తగ్గిందని అధికారులు తెలిపారు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం కావడంతో కొంత భక్తుల రద్దీ తగ్గిందని అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఏడు కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరికి దర్శనం సమయం 16 గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఇప్పుడు ప్రవేశించే వారికి అదనంగా మరో నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 66,072 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,239 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story