Fri Jan 30 2026 10:23:40 GMT+0000 (Coordinated Universal Time)
ఉగాదినాడు తిరుమలలో రద్దీ?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉగాది పర్వదినం కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుమలకు రాలేదు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉగాది పర్వదినం కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుమలకు రాలేదు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని రెండు కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఐదు గంటల్లో దర్శనం పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటలకు సర్వదర్శనం టోకెన్లు లేకుండా క్యూ లైన్ లో ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
వీఐపీ బ్రేక్ ....
ఈరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఉగాది పర్వదినం కావడంతో వీఐపీ బ్రేక్ దర్శనాలు లేవని ఇదివరకే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. నిన్న తిరుమల శ్రీవారిని 57,559 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 18,150 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.26 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

