Thu Jan 29 2026 16:11:00 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. మంగళవారం కావడంతో పెద్దగా భక్తుల సంఖ్య లే

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. మంగళవారం కావడంతో పెద్దగా భక్తుల సంఖ్య లేదు. క్యూ లైన్లలో భక్తులు పెద్దగా వేచి ఉండగానే శ్రీవారి దర్శనం పూర్తవుతుంది. వసతి గృహాలు కూడా సులువుగానే దొరుకుతున్నాయి. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులు మాత్రం ఎక్కువగా తిరుమలకు వస్తున్నారు. వీరికి శ్రీవారి దర్శనం గంట నుంచి రెండు గంటల్లో పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 64,512 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,491 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.69 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని నాలుగు కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూలైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటలు పడుతుంది.
Next Story

