Thu Jan 16 2025 00:50:35 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొద్దిగా పెరిగింది. నిన్నటి వరకూ స్వామి వారి దర్శనం క్యూ లైన్ లో ఉండకుండానే నేరుగా దర్శనం జరిగేది
తిరుమలలో భక్తుల రద్దీ కొద్దిగా పెరిగింది. నిన్నటి వరకూ స్వామి వారి దర్శనం క్యూ లైన్ లో వేచి ఉండకుండానే నేరుగా దర్శనం జరిగేది. అయితే నేడు కంపార్ఠ్మెంట్లలో భక్తులు కనిపిస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
పదకొండు కంపార్ట్మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని పదకొండు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 69,072 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,239 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.51 కోట్ల రూపాయలు వచ్చింది.
Next Story