Thu Jan 29 2026 06:20:20 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేడు పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు స్వల్పంగా పెరిగింది. దర్శనానికి పది గంటల సమయం పడుతుంది

తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు స్వల్పంగా పెరిగింది. వీకెండ్ దగ్గర పడటంతో రేపు శనివారం కావడంతో ముందుగానే భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. నిన్న, మొన్న తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. ఈరోజు మాత్రం కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయి ఉన్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ ను కొనుగోలు చేసిన భక్తులకు నేడు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
దర్శనానికి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని తొమ్మిది కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు స్వామి వారి దర్శనం పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 57,223 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 18,051 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.44 కోట్ల రూపాయలు వచ్చింది.
Next Story

