Fri Jan 30 2026 13:23:48 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ చాలా వరకూ తగ్గింది. ఒక కంపార్ట్ మెంట్ లోనే భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు

తిరుమలలో భక్తుల రద్దీ చాలా వరకూ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒక కంపార్ట్ మెంట్ లోనే భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో భక్తులకు కేవలం రెండు గంటల్లోనే స్వామి వారి దర్శనం పూర్తవుతుంది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు పొందిన భక్తులకు శ్రీవారి దర్శన సమయం రెండు గంటల్లోనూ పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 79,555 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 21,504 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.44 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

