Sun Dec 14 2025 02:18:54 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో భారీగా భక్తులు
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గలేదు. ఆదివారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గలేదు. ఆదివారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని పదమూడు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా సర్వదర్శనం టోకెన్లు లేకుండా క్యూ లైన్లో ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం మాత్రం...
మూడు వందల రూపాయల శీఘ్రదర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకూ సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 81,305 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,342 మంది తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.71 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

