Fri Jan 30 2026 04:21:55 GMT+0000 (Coordinated Universal Time)
పెరిగిన రద్దీ.. దర్శన సమయం?
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గలేదు. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గలేదు. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని పదమూడు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్లోకి నడకదారిన వచ్చిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూ లైన్లోకి ప్రవేశించిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేేసిన భక్తులకు మాత్రం రెండు నుంచి మూడు గంటల సమయంలో శ్రీవారి దర్శనం పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 64,707 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,676 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.98 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

