Sat Jan 31 2026 05:51:20 GMT+0000 (Coordinated Universal Time)
శనివారం.. రద్దీ ఎంత ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శనివారం కావడంతో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతుంది.

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శనివారం కావడంతో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతుంది. వైకుఠం క్యూ కాంప్లెక్స్ లోని 28 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరి దర్శనానికి పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. క్యూ లైన్ లో ఉన్నవారికే ఈ సమయం. కొత్తగా క్యూ లైన్ లోకి వచ్చే వారికి మరింత సమయం పడుతుంది.
రూ.300 ప్రత్యేక దర్శనానికి...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 62,203 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,100 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.91 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
Next Story

