Fri Jan 30 2026 07:28:41 GMT+0000 (Coordinated Universal Time)
దర్శనానికి 36 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువయింది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువయింది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లలో నిండిపోయిన భక్తులు ఎన్జీఆర్హెచ్ షెడ్స్ వరకూ క్యూ లైన్ లో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూ లైన్ లో ప్రవేశించిన భక్తులకు స్వామి వారి దర్శనం 36 గంటల సమయం పడుతుందాని అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల శీఘ్రదర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 66,310 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,980 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.16 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

