Sat Dec 06 2025 15:42:38 GMT+0000 (Coordinated Universal Time)
అంబటి రాంబాబు కు మరోసారి కరోనా
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా సోకింది. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా సోకింది. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ గా తేలినట్లు అంబటి రాంబాబు వీడియోను విడుదల చేశారు. తనకు జలుబు, ఒళ్లు నొప్పులు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నానని, పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయనను ఆసుపత్రికి వెళ్లారు.
భోగి వేడుకల్లో...
అంబటి రాంబాబు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అందరితో కలిసి నృత్యాలు కూడా చేశారు. దీంతో తనను కలసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని అంబటి రాంబాబు కోరారు. తనను వారం రోజుల పాటు ఎవరూ కలిసే ప్రయత్నం చేయవద్దని ఆయన కోరారు.
Next Story

