Sat Jan 31 2026 12:17:41 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కరోనా మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. మరణాలు మాత్రం పెరిగాయి. ఈరోజు ఏపీలో 178 కొత్త కేసులు నమోదయ్యాయి

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. మరణాలు మాత్రం పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 178 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఆరుగురు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,72,624 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,438 మంది మరణించారు.
టెస్ట్ ల సంఖ్య...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,56,046 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 2,140 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,03,72,427 నమూనాలను పరీక్షించారు
Next Story

